ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ప్రతి విజయం ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. అలానే ప్రతి ఓటమి ర్యాంక్ను తగ్గిస్తూ పోతోంది. ఇప్పుడు భారత జట్టు రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది. డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో ఇంగ్లండ్ గడ్డసూ సిరీస్ సమం చేసి.. వెస్టిండీస్ను వైట్వాష్ చేయడంతో మూడో ర్యాంక్లో నిలిచిన టీమిండియాకు పెద్ద షాక్. ఈడెన్ గార్డెన్స్ లో అనూహ్య ఓటమితో భారత ర్యాంక్ పడిపోయింది.

