
ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున విరుచుకుపడింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయేల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, మరికొందరు కీలక సైనిక నేతలు, అలాగే మొహమ్మద్ మెహ్ది టెహ్రాంచి, ఫెరెడౌన్ అబ్బాసి అనే ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడిలో మరణించినట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది.