ఇండియన్ పికిల్బాల్ లీగ్ (IPBL) ప్రారంభ సీజన్ కోసం మొదటి ఐదు ఫ్రాంచైజీలను తమిళనాడు DyCM ఉదయనిధి స్టాలిన్,ది టైమ్స్ MD వినీత్ జైన్ చెన్నైలో ఆవిష్కరించారు. ఈ ఫ్రాంచైజీలలో గుర్గావ్ క్యాపిటల్ వారియర్స్, ముంబై స్మాషర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, చెన్నై సూపర్ వారియర్స్, హైదరాబాద్ రాయల్స్ ఉన్నాయి. ఈ లీగ్లో ఆరో జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఇండియన్ పికిల్బాల్ లీగ్ తొలి సీజన్ను డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో నిర్వహించనున్నారు.

