
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని.. సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఎవరైనా.. కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చి చెప్పారు.