ఆఫ్ఘనిస్తాన్ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏఎన్డీఎమ్ఏ) శనివారం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

