
కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. యువత కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయితే ఈ మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ఈ క్రమంలోనే పెద్దలలో ఆకస్మిక మరణాలకు, కోవిడ్-19 వ్యాక్సిన్లకు మధ్య సంబంధం లేదని ఆ అధ్యయనాలు స్పష్టం చేశాయి. వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.