అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించారు. గతంలో ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ స్పీకర్కు పలు రాజకీయ పార్టీలు నోటీసులు అందించాయి. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక మేరకు పదవి నుంచి వైదొలగాలని యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో దాదాపు ఏడాది తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

