మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘‘మహిళా రిజర్వేషన్ చట్టం – 2023’’ గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది.తదుపరి జనాభా లెక్కల (Census) ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే మహిళా రిజర్వేషన్ను అమలు చేయగలమని అధికారి పేర్కొన్నారు.

