loader
iqonic-blog

<span;>అహ్మదాబాద్‌లో జరిగిన 70వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విత్ గుజరాత్ టూరిజం వేడుకలో, ది ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ (IPBL) అధికారిక లోగో ఆవిష్కరణ జరిగింది. దేశంలోనే తొలి పికిల్ బాల్ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గా పేరు సంపాదించుకున్న ఈ లీగ్ లోగో ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది

iqonic-blog

ఈ ఏడాది చివరిలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చంటూ వచ్చిన పత్రికా కథనాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం స్పందించారు. తనకు ఎటువంటి తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని లాల్‌ బాగ్‌ వద్ద ప్రజలతో ముచ్చటించేందుకు వచ్చిన డీకే పత్రికా కథనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కొన్ని మీడియా చానెళ్లు వాస్తవాలను వక్రీకరించి సంచలనాత్మక కథనాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

iqonic-blog

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ’ఇండియా’ కూటమి నుంచి పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ శనివారం వెల్లడించారు.

iqonic-blog

RJD కంచుకోటగా భావించే రఘోపూర్ నుంచి ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ ఓడిపోతారని జన్‌ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్టే తేజస్వీ కూడా రఘోపూర్ నుంచి ఓడిపాతారని అన్నారు. వైశాలి జిల్లాలోని వీవీఐపీ నియోజకవర్గమైన రఘోపూర్‌ నుంచి ఎన్నికల ప్రచారానికి ప్రశాంత్ కిశోర్ శనివారంనాడు శ్రీకారం చుట్టారు. రఘోపూర్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు, రబ్రీదేవి మూడుసార్లు శాసససభ్యులుగా గతంలో ఎన్నికయ్యారు.

iqonic-blog

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన తాజా నిర్ణయం దీనికి నిదర్శనం. విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నవంబర్ 15 నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ సర్వీసులు వారానికి మూడు రోజులు – మంగళవారం, గురువారం, శనివారం -లభ్యమవుతాయని మంత్రి వివరించారు. ఈ మార్గంలో నడిచే విమానాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌లోని ప్రముఖ చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు నేరుగా చేరనున్నాయి.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. ఆమెను “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు – 2025”కి ఎంపిక చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ప్రకటించింది. వ్యాపార రంగంలో ఆమె చూపిన సమర్ధనేతృత్వం, సామాజిక సేవల్లో చేసిన విశేష కృషి, మహిళా సాధికారత పట్ల చూపిన అంకితభావం కారణంగా ఈ అవార్డును అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

iqonic-blog

మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం శనివారం చెన్నైలో ల్యాండ్ కాకముందే దాని పైలట్ విండ్ షీల్డ్‌లో(అద్దంలో) పగుళ్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది గమనించిన పైలట్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో తగు ఏర్పాట్లు చేశారు. విమానం చివరికి సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని పార్కింగ్ కోసం ప్రత్యేక బే కి తీసుకెళ్లి, తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దింపామని అధికారులు వివరించారు.

iqonic-blog

వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికీ ఫిర్యాదు చేశారు. మేడారం ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 71 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కాగా ఈ మేరకు టెండర్లను పిలవడం జరిగింది. అయితే ఈ టెండర్‌ను తన అనుచరునికి ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON