
కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలోని రాజకీయ నాయకులపై హనీ ట్రాప్ జరుగుతోందని ఆయన తెలిపారు. తుమకూరుకు చెందిన ఇద్దరు మంత్రులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు పత్రికలలో వార్తలు వచ్చాయని,