
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని కమిషనర్ కృష్ణతేజ అధికారులకు సూచించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..