
తమిళనాడులో బలవంతంగా హిందీ అమలు వివాదం నేపథ్యంలో మక్కల్ మయ్యం నీది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కేంద్రానికి హెచ్చరికలు చేశారు. తమిళులకు భాష కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర ఉందని, దాంతో ఆడుకోవద్దన్నారు.
తమిళులకు, పిల్లలకు కూడా వారికి ఏ భాష అవసరమో తెలుసన్నారరు. వారికి అవసరమైన భాషను ఎంచుకునే జ్ఞానం వారికి ఉందని కమల్ హాసన్ తేల్చిచెప్పేశారు.