
ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తమ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉద్యోగులు తమ విధుల నుండి సా.4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. ప్రభుత్వం ప్రభుత్వ రంగం సంస్థల్లో కార్పొరేషన్లలో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సిఎస్ పేర్కొన్నారు.