loader

ఉమెన్స్‌ డే సందర్భంగా ఆసక్తికర విషయం బయటపెట్టిన ప్రధాని మోదీ!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రధాని, ప్రతి సంఘటనకు తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. ఈ విషయంలో మహిళల పాత్రను ప్రధాని ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వీసా కావాలంటే సోషల్‌ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే

ఇమ్మిగ్రేషన్‌ స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసిన 14161 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో భాగంగా అమెరికా వీసా, గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులతోపాటు తమ సోషల్‌ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌(డీహెచ్‌ఎస్‌) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది.

జనంలోకి ఘనంగా కేసీఆర్.. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ..!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే సందర్భాన్ని బట్టి మాత్రమే ప్రజల్లోకి వచ్చే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు మరోసారి జనాల్లోకి ఘనంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించారు.

మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్

ఓ జాతీయ ఛానల్ కాన్‌క్లేవ్‌లో  ఆయన చాలా అంశాలపై స్పందించారు. తెలంగాణ న‌మూనాయే దేశానికి న‌మూనా. 450 ఏళ్ల‌కుపైగా చ‌రిత్ర తెలంగాణ‌, హైద‌రాబాద్‌కు ఉంది. చార్మినార్‌, గోల్కొండ కోట చంద్ర‌బాబు క‌ట్టారా?సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ రావు క‌ట్టారా.? హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ క‌ట్ట‌డాల‌న్నీ 450 ఏళ్ల నుంచే ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌భుత్వాలు మారినా ముఖ్య‌మంత్రులు మారినా అభివృద్ధి కొన‌సాగింది. హైద‌రాబాద్ బ్రాండ్‌ను రేవంత్ రెడ్డి ఎక్క‌డికి తీసుకెళ‌తారో చూడండి అని తెలంగాణ సీఎం అభిప్రాయపడ్డారు.

ఉమెన్స్‌డే స్పెషల్‌.. ప్రధాని మోదీ సభకు మహిళా పోలీసులతో భద్రత..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్‌ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించనుండటం విశేషం.హెలిప్యాడ్‌ నుంచి వేదిక వరకూ ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహరా కాయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం

ఓటీటీలోకి వచ్చేసిన నాగచైతన్య ‘తండేల్’…

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, ఒకేరోజు 20 సినిమాలు పలు ఓటీటీ ప్లాట్ ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అందులో 4 తెలుగు సినిమాలు ఉన్నాయి.శర్వానంద్ ‘మనమే’, విశ్వక్ సేన్ ‘లైలా’,

ఉమెన్స్ డే

1917లో రష్యా మహిళలు మొదటిసారిగా ప్రపంచ యుద్ధం కారణం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. సరైన ఆహారం లేక నిద్రలేక ఎన్నో అవస్థలు పడుతూ ఉండడంతో ఆ దేశంలోని మహిళలు కూడా ఆందోళన చేపట్టారట. దీని ఫలితం గానే ఆ దేశపు చక్రవర్తి నికోలస్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం వల్ల మహిళలకు ఓటు హక్కు కల్పించడం వల్లే మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నారట. ఆరోజు మార్చి 8 కావడం వల్లే ఆ […]

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మహిళా దినోత్సవం అనేది కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందట.. ఎంతోమంది మహిళలు కూడా తమ హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారట. వాటి ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఏర్పడిందట.. 1908లో అమెరికాలో న్యూయార్కులో మొదట 15,000 మంది మహిళలు తమ పని గంటలను సైతం తగ్గించాలంటూ డిమాండ్ చేశారట. అలాగే వారికి ఓటు హక్కును కూడా కల్పించాలంటూ పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలనే విధంగా హెచ్చరించారట. 1975లో మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON