loader

ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా!

అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది.  కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ, తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్యోగ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్‌లో చాట్ థీమ్ ఫీచర్..

వాట్సాప్ వినియోగం పెరుగుతున్న కొద్దీ యూజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు కంపెనీ వివిధ రకాల ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. తాజాగా చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి ‘చాట్ థీమ్‌’ స్పెసిఫికేషన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు యూజర్లు నచ్చిన కలర్‌‌లో చాట్‌ను సెటప్ చేసుకోవచ్చు. ఇకనుంచి అందరు యూజర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణను పునర్నిర్మించిన ఘనత బీఆర్ఎస్‌దే.. మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్ళు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులు వేయగలిగామని, అదే ప్రగతిని ఆర్బీఐ తన నివేదికలో తెలియజేసిందని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అన్ని రంగాలల్లో పురోగామిగా అతితక్కువ కాలంలో ఎదిగిందని లెక్కలతో సహా ఆర్బీఐనే చెప్పిందని గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు ‌అసంతృప్తి. . .

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి అధికారులకు మధ్య ఎక్కడో చిన్న సమన్వయ లోపం ఉన్నట్టు కనిపిస్తోంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారుల గురించి మాట్లాడుతూ ‘ IAS, IPSలు కూడా ఏసీ గదులకు అలవాటు పడిపోయారని ఫీల్డ్ విజిట్ అనేది పక్కన పెట్టేసారు’అంటూ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి ” మీరు ఇంకా పాత పాలనలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. పద్ధతి మారాలి. తనతోపాటు పరుగులు పెట్టాలంటూ ” పదే పదే చెబుతున్నారు.  సీరియస్ […]

ఇండియాలో ఎన్ని కోట్ల ఆధార్ కార్డులు. . .

2009లో వచ్చిన ఆధార్‌ (Aadhaar) ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్‌ బేస్డ్‌ ఐడెంటిటీ ప్రోగ్రామ్. దేశంలో ప్రతి పౌరుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించడమే దీని లక్ష్యం. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 136.65 కోట్ల ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయి. దాదాపు 97 శాతం జనాభాకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆధార్‌ ఆధారిత సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి  జనవరిలో ఏకంగా 284 కోట్ల ఆధార్‌ బేస్డ్‌ ట్రాన్సాక్షన్లు జరిగాయి.

ముస్లిం ఉద్యోగులకు శుభవార్త

ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తమ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉద్యోగులు తమ విధుల నుండి సా.4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. ప్రభుత్వం ప్రభుత్వ రంగం సంస్థల్లో కార్పొరేషన్‌లలో పని చేస్తున్న ముస్లిం  ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON