
సచివాలయాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి.. గ్రేడ్-4 పంచాయతీల్లో 72 మందిని నియమించింది. ఇక సచివాలయల్లో ఉన్న 11 మంది ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజించి. రెండేసి సచివాలయాలను ఒక్క క్లస్టర్గా పరిగణించి.. సిబ్బందిని సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు జనాభా అధారంగా సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించేందుకు పంచాయితీరాజ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.