
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) సంస్థ ఏకంగా 1 బిలియన్ యూఎస్ డాలర్లు సాయం ప్రకటించింది. అంటే రూ. 7,500 కోట్లు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. అయితే IMF తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్థాన్.. ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది.