
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి అధికారులకు మధ్య ఎక్కడో చిన్న సమన్వయ లోపం ఉన్నట్టు కనిపిస్తోంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారుల గురించి మాట్లాడుతూ ‘ IAS, IPSలు కూడా ఏసీ గదులకు అలవాటు పడిపోయారని ఫీల్డ్ విజిట్ అనేది పక్కన పెట్టేసారు’అంటూ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి ” మీరు ఇంకా పాత పాలనలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. పద్ధతి మారాలి. తనతోపాటు పరుగులు పెట్టాలంటూ ” పదే పదే చెబుతున్నారు. సీరియస్ గానే అధికారులకు హెచ్చరిస్తున్నారు.