
ఢిల్లీ జడ్జీ ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీగా డబ్బు లభించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్ద మొత్తంలో నగదు దొరికినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన విషయంలో తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది.