
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో శనివారం(మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి తెలిపారు