
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.