
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పాకిస్థాన్తో తలపడనుండగా ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్కు చేరనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను ఓడించింది పాకిస్థాన్. ఈ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.