
భారతీయ అక్రమ వలసదారులను బహిష్కరించడం ప్రారంభించింది. అమెరికా సైనిక విమానం సీ-17 భారతదేశానికి అక్రమ వలసదారులతో బయలుదేరిందని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్టుగా రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.
ఆ విమానం భారతదేశానికి చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని కూడా ఆ అధికారి పేర్కొన్నారు. ఇక, టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మంది భారతీయులతో ఈ విమానం బయలుదేరిందనే వార్తలు వస్తున్నాయి.