అబుదాబీలో అల్ మైరాహ్ ఐలాండ్లోని ఏడీజీఎ స్క్వేర్లో ఏడీఎన్ఓసీ గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పెట్రోకెమికల్, ఇంధన, ఎల్ఎన్జీ, గ్యాస్ ప్రాసెసింగ్, పోర్ట్ లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలు గురించి చర్చించారు. అబుదాబీ చాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ 42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

