భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నతన ఆటకు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. నా జీవితానికే అర్థం చెప్పిన టెన్నిస్కు వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉంది. 20 ఏళ్ల సుమధురమైన సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ఇప్పుడు రాకెట్ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే నాకు దక్కిన పెద్ద గౌరవం’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.

