హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అందిన బాంబు బెదిరింపు ఈమెయిల్ సంచలనం సృష్టించింది. జెడ్డా నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6E 68 విమానంలో “హ్యూమన్ బాంబ్” ఉన్నట్లు ఆ ఈమెయిల్లో హెచ్చరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై అత్యవసర ప్రోటోకాల్స్ అమలు చేశారు. ఈ బెదిరింపు నేపథ్యంలో అధికారులు విమానాన్ని వెంటనే ముంబైకి మళ్లించారు. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పూర్తి తనిఖీలు నిర్వహించిన తర్వాత ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

