ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం దంపతులు లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాలు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు ఘన స్వాగతం పలికారు. నవంబర్ 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి రెండు అవార్డులను నారా భువనేశ్వరి అందుకోనున్నారు.

