శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మహిళలు ప్రస్తుతం జీవన పోరాటం సాగిస్తున్నారు. జేమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ ముగ్గురు మహిళలు కళావతి (49), ఆసిరి అమ్మ (51), కుమారి (28). ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

